YCP ప్రభుత్వంపై ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ధ్వజం
ABN , First Publish Date - 2022-05-23T16:01:21+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం హత్యలకు, లైంగికదాడులకు నిలయంగా మారిందన్నారు.
పశ్చిమగోదావరి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్(Angara rammohan) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం హత్యలకు, లైంగికదాడులకు నిలయంగా మారిందన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే నేరాలకు పాల్పడుతున్నా వైసీపీ అధిష్ఠానం పట్టించుకోదని మండిపడ్డారు. సీఎం బాబాయి వివేకా(Viveka) హత్య కేసులో ఎంపీ నిఖిత్ రెడ్డి పాత్ర ఉందని, సీబీఐ తేల్చినా ఇప్పటికీ ఎటువంటి చర్యలు లేవని అన్నారు. కాకినాడలో సొంత డ్రైవర్ను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు(Anantababu)పై ఎన్నో నేరారోపణలు ఉన్నాయని తెలిపారు. టీడీపీ, దళిత సంఘాల ఆందోళనతోనే ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదు చేశారని అంగర రామ్మోహన్ అన్నారు.