BTech Ravi: అసత్యప్రచారం చేస్తున్నానంటూ నాపై టీటీడీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-09-23T15:42:11+05:30 IST

తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే సందర్భంలో భక్తులు పడుతున్న ఇబ్బందులపై మాట్లాడితే... అసత్య ప్రచారం చేస్తున్నాడంటూ టీటీడీ తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎమ్మెల్సీ బిటెక్ రవి అన్నారు.

BTech Ravi: అసత్యప్రచారం చేస్తున్నానంటూ నాపై టీటీడీ ఫిర్యాదు

తిరుమల: తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే సందర్భంలో భక్తులు పడుతున్న ఇబ్బందులపై మాట్లాడితే... అసత్య ప్రచారం చేస్తున్నానంటూ టీటీడీ(TTD) తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎమ్మెల్సీ బీటెక్ రవి (Btech Ravi) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... తిరుమల పవిత్రను కాపాడడంపై టీటీడీ  దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ(NTR Health university) పేరు మార్పు చేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. రాజకీయ నాయకులు ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చని తెలిపారు. కుప్పంలో ఈరోజు జగన్ (YC Jagan mohan reddy) పర్యటిస్తున్నారని... త్వరలోనే చంద్రబాబు (Chandrababu naidu) పులివెందులలో పర్యటిస్తారని ఎమ్మెల్సీ బీటెక్ రవి (TDP MLC) వెల్లడించారు. 

Updated Date - 2022-09-23T15:42:11+05:30 IST