Greetings: ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎంపీలు

ABN , First Publish Date - 2022-07-22T18:11:25+05:30 IST

రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు టీడీపీ ఎంపీలు కనకమెడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ,కేశినేని నాని శుభాకాంక్షలు తెలిపారు.

Greetings: ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎంపీలు

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము (draupadi murmu)కు టీడీపీ ఎంపీలు (TDP MPs) కనకమెడల రవీంద్ర కుమార్ (kanakamedala ravindra kumar), గల్లా జయదేవ్ (Galla jayadev), రామ్మోహన్ నాయుడు(Rammohan naidu), కేశినేని నాని (Kesineni nani) శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశానికి నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు టీడీపీ తరపున అభినందించినట్లు తెలిపారు. సామాజిక న్యాయంలో భాగంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు తెలిపిందని అన్నారు. వెనకబడిన వర్గాలకు మద్దతుగా ఉండాలని టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారన్నారు. రాష్ట్రపతి హోదాలో దేశాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో కూడా టీడీపీ తరపున ద్రౌపది ముర్ము మద్దతు ఉంటుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-22T18:11:25+05:30 IST