టీడీపీ ముదునూరు కమిటీ నియామకం

ABN , First Publish Date - 2022-08-08T06:16:39+05:30 IST

టీడీపీ ముదునూరు కమిటీ నియామకం

టీడీపీ ముదునూరు కమిటీ నియామకం

ఉయ్యూరు, ఆగస్టు 7 : వైసీపీ ప్రభుత్వ అవినీతి, అరాచకపాలనను ప్రజల్లో ఎండగట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు సుశిక్షితులైన సైనికుల్లా పనిచేయాలని  మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. నూతనంగా ఎంపికైన ముదునూరు గ్రామ కమిటీ ఆదివారం బోడె ప్రసాద్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.  పార్టీ మండల అధ్యక్షుడు యెనిగళ్ల కుటుంబరావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరి  నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

  పార్టీ గ్రామ అధ్యక్షుడిగా దూసర అజయ్‌,  సెక్రటరీగా తుమ్మల సురేష్‌ , ఉపాధ్యక్షుడిగా చిమటా సాంబశివరావు, కార్యదర్శులుగా  బోలెం నాగరాజు, పల్లపాటి శ్రీనివాస్‌, గుల్లంకి ప్రదీప్‌  పాగోలు ప్రభాకర్‌, తూమాటి వెంకటేశ్వ రరావు నియమితులయ్యారు. తెలుగు యువత గ్రామ అధ్యక్షుడిగా కలపాల ఫణిప్రకాష్‌,  ఉపాధ్యక్షుడిగా  నిమ్మగడ్డ పూర్ణప్రసాద్‌ను నియమించారు.

పేదలకు వైద్యం అభినందనీయం

పెనమలూరు : నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితం గా మందులను పంపిణీ చేయటనం అభినందించదగ్గ విషయమని మాజీ ఎమ్మెల్యే  బోడె ప్రసాద్‌ అన్నారు. ఆదివారం టీడీపీ పెనమలూరు  కార్యాల య ప్రాంగణంలో పార్టీ తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనుమోలు ఆదరణ చారిటబుల్‌ ట్రస్టు బాధ్యులు అనుమోలు ప్రభాకరరావు మాట్లాడుతూ, తమ ట్రస్టు తరపున ప్రతి నెల మొదటి ఆదివారం పేదలకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేస్తామని తెలిపారు. 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T06:16:39+05:30 IST