వైసీపీ దిక్కుమాలిన పార్టీ

ABN , First Publish Date - 2021-03-01T08:50:06+05:30 IST

వైసీపీ తరఫున పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక, టీడీపీ అభ్యర్థుల్ని బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బులుగు కండువాలు కప్పారని

వైసీపీ దిక్కుమాలిన పార్టీ

బయటికి రావాలంటే జగన్‌కు భయం

ఓట్లడగాలంటే ఆ పార్టీ అభ్యర్థులకు భయం

బెదిరించి బులుగు కండువాలు కప్పుతున్నారు

అందుకే జగన్‌ను పిరికివాడనేది: లోకేశ్‌


అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ తరఫున పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక, టీడీపీ అభ్యర్థుల్ని బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బులుగు కండువాలు కప్పారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్‌చేశారు. ‘పలాస, రాయదుర్గంతోపాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీ వైసీపీ. తాడేపల్లి కొంప గేటు దాటి వస్తే జనం తంతారని జగన్‌కు భయం.


వైసీపీ అభ్యర్థులకు జనంలోకి వెళ్లి ఓట్లడగాలంటే భయం. పంచాయతీ ఎన్నికలు పీక మీద కత్తిపెట్టి గెలుచుకున్నారు. పురపాలక ఎన్నికల్లో గెలిచే తెలుగుదేశం అభ్యర్థుల్ని ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారు. నువ్వో నాయకుడివి. నీదో పార్టీ. అందుకే నిన్ను పిరికివాడు అనేది జగన్‌రెడ్డి’ అని లోకేశ్‌ విమర్శించారు. 


Updated Date - 2021-03-01T08:50:06+05:30 IST