Nara Lokesh: జగన్రెడ్డి పాలనలో ఉపాధ్యాయులకు అవమానాలు అన్నీ ఇన్నీ కావు..
ABN , First Publish Date - 2022-09-05T17:53:31+05:30 IST
గురువును మించిన దైవం లేదు. విద్యాబుద్ధులు నేర్పి సమాజ ఉన్నతికి నిరంతరం కృషి చేసే ఉపాధ్యాయులకు గురుపూజోత్సవం
అమరావతి: గురువును మించిన దైవం లేదు. విద్యాబుద్ధులు నేర్పి సమాజ ఉన్నతికి నిరంతరం కృషి చేసే ఉపాధ్యాయులకు గురుపూజోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(TDP National General Secretary Nara Lokesh) ట్విట్ చేశారు. అమ్మకి అన్నం పెట్టని వాడు..గురువుకి దండం పెట్టనివాడు సీఎంగా ఉన్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి పాలనలో గౌరవం మాట దేవుడెరుగు కానీ..ఉపాధ్యాయులకు అవమానాలు అన్నీ ఇన్నీ కావని ట్విట్టర్ వేదికగా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.