సీఎం వైఎస్ జగన్‌పై అచ్చెన్న తీవ్ర విమర్శలు

ABN , First Publish Date - 2021-05-09T17:54:35+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త...

సీఎం వైఎస్ జగన్‌పై అచ్చెన్న తీవ్ర విమర్శలు

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త శ్రీనివాసులును శనివారం అర్ధరాత్రి వైసీపీ నేతలు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆదివారం మీడియా మీట్ ఏర్పాటు చేసిన అచ్చెన్న.. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‎గా సీఎం జగన్ మోహన్ రెడ్డి మారారని ఆరోపించారు. కర్నూలులో టీడీపీ కార్యకర్తను హత్య చేయడం దుర్మార్గమన్నారు. ప్రత్యర్థి నాయకులను, కార్యకర్తలను అంతమొందించి జగన్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. బడుగు, బలహీనవర్గాలే లక్ష్యంగా జగన్ రెడ్డి అండ్ కో దాడులు, హత్యలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాసులు కుటుంబానికి టీడీపీ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీనివాసులును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-05-09T17:54:35+05:30 IST