నేను చేసేది ధర్మపోరాటం : చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-29T22:20:38+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత తీవ్రస్థాయిలో ఆగ్రహం

నేను చేసేది ధర్మపోరాటం : చంద్రబాబు

చిత్తూరు: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ అధర్మ పాలనపై తాను చేసేది ధర్మపోరాటమని ఆయన అన్నారు. తన సొంత నియోజక వర్గమైన కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన బహిరంగ సభలో మాట్లాడారు.  రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదన్నారు. తన పర్యటనకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు తనకు లేదా అని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీసారు. తన మీద బాంబు వేస్తామని ఒకాయన అంటున్నారని, తనను ప్రజా దేవుళ్లే కాపాడుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. తాను చేసేది ధర్మపోరాటమన్నారు. 


ఎక్కడికొస్తారో రండి.. చూసుకుందాం, ధైర్యం ఉందా అని చంద్రబాబు సవాల్ విసిరారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసి, టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. డీజీపీ ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి దాడి సమయంలో ఎందుకున్నాడని ఆయన ప్రశ్నించారు. నకిలీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఏపీని సారాయి, గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారన్నారు. అక్రమ కేసులకు భయపడి మేం సరెండర్‌ కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు వదిలేసి పారిపోవాలా అని చంద్రబాబు నిలదీసారు. 70 లక్షల మంది సభ్యులున్న పార్టీ టీడీపీ అని చంద్రబాబు పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-29T22:20:38+05:30 IST