ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలేవీ?

ABN , First Publish Date - 2022-08-10T05:55:12+05:30 IST

జగన్‌రెడ్డికి ఏమాత్రం సిగ్గున్నా గోరంట్ల మాధవ్‌ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసేవారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర మాజీ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు ధ్వజమెత్తారు.

ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలేవీ?
లాడ్డి సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న విభిన్న ప్రతిభావంతులు

నిరసన కార్యక్రమంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు  

గుంటూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డికి ఏమాత్రం సిగ్గున్నా గోరంట్ల మాధవ్‌ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసేవారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర మాజీ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. నగరంలోని లాడ్డి సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద విభిన్న ప్రతిభావంతులు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక నేరగాళ్లు, ఆకురౌడీలకు వైసీపీ పునరావాస కేంద్రంగా ఉందని ఆయన విమర్శించారు. మహిళలను అగౌరవపరుస్తూ సభ్యసమాజం తలదించుకునేలా అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ ఎంపీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గంట, అరగంట అంటూ అసభ్యంగా మాట్లాడినవారికి జగన్‌రెడ్డి ప్రమోషన్‌ ఇచ్చి మంత్రి పదవులు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి స్వతహాగా నేర స్వభావం కలవాడు కాబట్టే పార్టీలో నేరస్థులు, రేపిస్టులు, ఖూనీకోరులకు ప్రాధాన్యం ఇచ్చి పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతివంతులు ధూళిపాళ్ల కార్తీక్‌, జ్యోతిబాబు, శ్రీనివాసచౌదరి, విజయ్‌కుమార్‌, ఎస్‌.సాయి, ఏ.మాధవి, అనిత, విజయలక్ష్మి, తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, తెలుగుదేశం శ్రేణులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-10T05:55:12+05:30 IST