ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2022-06-27T06:23:04+05:30 IST

గ్రేటర్‌ 47వ వార్డులో టీడీపీ నాయకులు ఆదివారం రాత్రి ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు.

ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన
కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తున్న టీడీపీ నాయకులు

అక్కయ్యపాలెం, జూన్‌ 26 : గ్రేటర్‌ 47వ వార్డులో టీడీపీ నాయకులు ఆదివారం రాత్రి ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా  తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని మోహన్‌ హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనివల్ల సామాన్య, మధ్య తరగతి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ పామోటి బాబ్జి, గొర్లె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-27T06:23:04+05:30 IST