టీడీపీ సీనియర్ నేత ‘గట్టి’ మృతి
ABN , First Publish Date - 2021-04-12T05:11:51+05:30 IST
సంతకవిటి మండలానికి చెందిన సీనియర్ టీడీపీ నేత గట్టి ఉమామహేశ్వరరావునాయుడు (94) ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సంతకవిటి సర్పంచ్గా పంచాయతీ అభివృద్ధికి కృషి చేశారు. తెలగ కుల సంఘ నేతగా వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేశారు.
రాజాం, సంతకవిటి, ఏప్రిల్ 11: సంతకవిటి మండలానికి చెందిన సీనియర్ టీడీపీ నేత గట్టి ఉమామహేశ్వరరావునాయుడు (94) ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సంతకవిటి సర్పంచ్గా పంచాయతీ అభివృద్ధికి కృషి చేశారు. తెలగ కుల సంఘ నేతగా వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేశారు. టీడీపీ సీనియర్ నేతగా పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. గట్టి మృతి చెందిన విషయం తెలుసుకుని అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. ఆదివారం సంతకవిటిలో అంతిమయాత్ర నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు. ఉమా మహేశ్వరరావు మృతికి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట రావు, ఎమ్మెల్యే కంబాల జోగులు, టీడీపీ నాయకుడు కొల్ల అప్పల నాయుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎస్వీ రమణారావు, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ తదితరులు సంతాపం తెలిపారు.