నన్నపనేని రాజకుమారికి గాయాలు
ABN , First Publish Date - 2020-09-26T18:59:46+05:30 IST
టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారికి గాయాలయ్యాయి. తెనాలిలోని ఆమె నివాసంలో కాలు జారి కింద పడ్డారు. దీంతో నన్నపనేని తలకు
గుంటూరు: టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారికి గాయాలయ్యాయి. తెనాలిలోని ఆమె నివాసంలో కాలు జారి కింద పడ్డారు. గార్డెన్లో మొక్కలు శుభ్రం చేస్తుండగా కిందపడ్డారు. దీంతో నన్నపనేని తలకు గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చెకప్ అనంతరం ఇంటికి చేరుకుని డాక్టర్ల పర్యవేక్షణలో నన్నపనేని చికిత్స పొందుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు.. నన్నపనేని ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు.