‘తిరుపతిలో వైసీపీని ఓడిస్తే ప్రజలంటే భయం పుట్టుకొస్తుంది’

ABN , First Publish Date - 2021-04-12T17:02:46+05:30 IST

తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే.. అప్పుడు ఆ పార్టీకి ప్రజలంటే భయం పుట్టుకొస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నిర్వహించిన ..

‘తిరుపతిలో వైసీపీని ఓడిస్తే ప్రజలంటే భయం పుట్టుకొస్తుంది’

అమరావతి : తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే.. అప్పుడు ఆ పార్టీకి ప్రజలంటే భయం పుట్టుకొస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నిర్వహించిన మీడియా మీట్‎లో ఆయన మాట్లాడుతూ.. ప్రజల కష్టాన్ని దోచుకునే బందిపోటు ఏదైనా ఉందటే అది వైసీపీ ప్రభుత్వమేనని తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచడమేనా మీ రాజన్న రాజ్యమంటూ? అంటూ జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై విద్యుత్ భారాన్ని రూ. 40వేల కోట్లు చేసిందని.. టీడీపీ హయాంలో రూ. 200 బిల్లు వస్తే.. ఇప్పుడు ఏకంగా 2వేలు వస్తోందని ఆయన మండిపడ్డారు. స్లాబుల పేరుతో మాయ చేసి రూ.1500 కోట్లు భారం మోపారని.. గ్రామాల్లో అనధికార కోతలు విధిస్తూ ప్రజల్ని జగన్ సర్కార్ వేధిస్తోందని.. రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు లేకుండా చేస్తున్నారంటూ గోవిందరెడ్డి ధ్వజమెత్తారు.

Updated Date - 2021-04-12T17:02:46+05:30 IST