టీడీపీ పొలిట్‌ బ్యూరోలోకి షరీఫ్‌

ABN , First Publish Date - 2021-10-17T05:25:00+05:30 IST

టీడీపీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరికి కీలక పదవులు దక్కాయి.

టీడీపీ పొలిట్‌ బ్యూరోలోకి షరీఫ్‌
శాసన మండలి మాజీ చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌

రాష్ట్ర కార్యదర్శిగా కోళ్ల 


నరసాపురం/భీమవరం, అక్టోబరు 16 : టీడీపీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరికి కీలక పదవులు దక్కాయి. శాసన మండలి మాజీ చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌కు పొలిట్‌ బ్యూరో లో స్థానం లభించింది. ఇప్పటి వరకు జిల్లా నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాత్రమే అందులో కొనసాగుతున్నారు. తాజాగా షరీఫ్‌కు స్థానం కల్పించడంపై తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి వివిధ పదవులు నిర్వహించారు. పార్టీ జాతీయ ప్రధా న కార్యదర్శిగా, ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌, మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పద వులు అలంకరించారు. ఆరేళ్ల క్రితం ఎమ్మెల్సీ, ఆ తర్వాత మండలి చైర్మన్‌గా షరీఫ్‌ ని యమితులయ్యారు. మూడు మాసాల క్రితం ఆయన పదవీ కాలం ముగిసిన నేప థ్యంలో తిరిగి ఆయనకు పార్టీలో కీలక పదవి లభించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా భీమవరానికి చెందిన ఏఎంసీ మాజీ చైర్మన్‌ కోళ్ల నాగేశ్వరరావును నియమించారు. ఈ మేరకు శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జాబితాను ప్రకటించారు.  

Updated Date - 2021-10-17T05:25:00+05:30 IST