రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం
ABN , First Publish Date - 2022-07-05T06:09:33+05:30 IST
తెలుగుదేశం పార్టీ వైసీపీలా గాలి పార్టీ కాదని ప్రజల మనస్సులో నుంచి పుట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
భీమవరం
అర్బన్, జూలై 4: తెలుగుదేశం పార్టీ వైసీపీలా గాలి పార్టీ కాదని ప్రజల
మనస్సులో నుంచి పుట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు
అచ్చెన్నాయుడు అన్నారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ప్రజలు
తండోప తండాలుగా వస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో 160 సీట్లు సాధించి
అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభా వం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా
అధ్యక్షురాలు తోటసీతారామలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన భీమవరం
నియోజవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లా డారు. ఇప్పటి వరకు వైసీపీ
ప్రభుత్వం రూ.11 లక్షలకోట్లు అప్పు చేసిందన్నారు. దుర్మార్గ ప్రభుత్వాన్ని
గద్దె దింపాలని పిలుపు నిచ్చారు. ప్రతి నియోజవర్గంలో 60వేల మందితో సభ్యత్వ
నమోదు చేయించాలన్నారు. పొలిట్బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, జాతీయ
ప్రధాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు,
ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, పాందువ్వ శ్రీను, తణుకు మాజీ ఎమ్మెల్యే
ఆరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లి గూడెం ఇన్చార్జి వలవల మల్లికార్జునరావు,
నరసాపురం ఇన్చార్జి పొత్తూరి రామాంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు.