2024లో టీడీపీకి అధికారం ఖాయం

ABN , First Publish Date - 2022-06-26T08:11:05+05:30 IST

2024లో టీడీపీకి అధికారం ఖాయం

2024లో టీడీపీకి అధికారం ఖాయం

ప్రజావేదికతోనే పునర్నిర్మాణాలు ప్రారంభిస్తాం: బుద్దా వెంకన్న

విజయవాడ(వన్‌టౌన్‌), జూన్‌ 25: జగన్‌రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావ డం ఖాయమన్నారు. ప్రజావేదికను కూల్చి మూడేళ్లైన సందర్భంగా.. పార్టీ శ్రేణులతో కలిసి ప్రజావేదికను సందర్శించేందుకు శనివారం  వెంకన్న విజయవాడ నుంచి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నా రు. బుద్దా మీడియాతో మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నిరంతరం పనిచేశారని గుర్తుచేశారు. జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని కూలగొట్టడానికి ప్రజావేదికతో కూల్చివేతలు ప్రారంభించారన్నారు. రాష్ట్ర ప్రజ లు జగన్‌కు 151 సీట్లు ఇస్తే, సైకో రాష్ట్రాన్ని నాశనం చేశాడని మం డిపడ్డారు. పోలీసులను చట్టపరంగా పనిచేయకుండా వారిపై ఒత్తిడి తెచ్చి టీడీపీ నేతలను అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అఽధికారంలోకి రాగానే ప్రజావేదికను నిర్మిస్తామని తెలిపారు.  

Updated Date - 2022-06-26T08:11:05+05:30 IST