ప్రకాశం జిల్లాలో మెజార్టీ స్థానాలు టీడీపీ కైవసం

ABN , First Publish Date - 2021-11-14T22:31:06+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. ఒక సర్పంచ్, ఏడు వార్డు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

ప్రకాశం జిల్లాలో మెజార్టీ స్థానాలు టీడీపీ కైవసం

ప్రకాశం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. ఒక సర్పంచ్, ఏడు వార్డు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కందుకూరు (మ) నరిశెట్టివారిపాలెం ఎన్నికల్లో ముప్పాళ్ళ శ్రీనివాసరావు గెలిచారు. టంగుటూరు మండలం ఎం.నిడమానూరు 12వ వార్డు మెంబర్‌గా టీడీపీ నేత కాకుమాను సుబ్బారావు విజయం సాధించారు. కంభం మండలం కందులాపురం 6వ వార్డులో బండారు వరలక్ష్మి గెలిచారు. ఇంకొల్లు మండలం పూసపాడు పంచాయతీ 5వ వార్డు మెంబర్‌గా టీడీపీ నేత గోరంట్ల లక్ష్మీతులసి గెలుపొందారు. తర్లుపాడు మండలం మీర్జాపేట 2వ వార్డులో టీడీపీ అభ్యర్థి నాగజ్యోతి విజయం సాధించారు. 


అలాగే ఎమ్మిగనూరు మండలం కె .తిమ్మాపురంలో వైసీపీకి షాక్‌ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీపై 38 ఓట్ల తేడాతో సీపీఐ నేత మహేశ్వరి విజయం సాధించారు. నంద్యాల మండలం భీమవరంలో వైసీపీకి ఓటర్లు షాకిచ్చారు. భీమవరం 4 వార్డు ఎన్నికల్లో  12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి జనార్థన్ విజయం సాధించారు. నంద్యాల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి సొంత వార్డులో వైసీపీ ఓటమిపాలయింది.

Updated Date - 2021-11-14T22:31:06+05:30 IST