విద్యార్థిని కిరాతకంగా హింసించిన టీచర్.. కులం పేరుతో తిడుతూ దాడి.. చివరకు..

ABN , First Publish Date - 2022-02-13T17:09:46+05:30 IST

అతను ఓ ఉపాధ్యాయుడు.. విశాల భావాలు కలిగి ఉండాల్సిన ఆ గురువు సంకుచిత మనస్తత్వంతో ఓ విద్యార్థిపై దాడి చేశాడు..

విద్యార్థిని కిరాతకంగా హింసించిన టీచర్.. కులం పేరుతో తిడుతూ దాడి.. చివరకు..

అతను ఓ ఉపాధ్యాయుడు.. విశాల భావాలు కలిగి ఉండాల్సిన ఆ గురువు సంకుచిత మనస్తత్వంతో ఓ విద్యార్థిపై దాడి చేశాడు.. తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని ఉగ్రరూపం దాల్చాడు.. విద్యార్థిని కులం పేరుతో దూషించాడు.. వీపు వాచిపోయేలా కర్రతో చితక్కొట్టాడు.. విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 


రాజస్థాన్‌లోని మహేంద్రపూర్ గ్రామానికి చెందిన గోవింద్ అనే విద్యార్థి స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం టీచర్ రామ్ మీనా అడిగిన ప్రశ్నలలో కొన్నింటికి సమాధానాలు చెప్పలేకపోయాడు. దీంతో గోవింద్‌పై రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేసి కర్రతో కొట్టాడు. గోవింద్‌ను కులం పేరుతో తిడుతూ కర్రతో చితక్కొట్టాడు. `మీ కులం వారు అజ్ఞానులు.. మీకు చదువెందుకు..` అంటూ దూషించాడు. 


శనివారం సాయంత్రం ఇంటికి వెళ్లిన గోవింద్ స్కూలులో జరిగిన మొత్తం విషయాన్ని తండ్రికి చెప్పాడు. వీపు మీద ఉన్న గాయాలను చూపించాడు. దీంతో గోవింద్ తండ్రి పోలీసులను ఆశ్రయించి టీచర్ రామ్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-02-13T17:09:46+05:30 IST