కడుపునొప్పి తాళలేక ఉపాధ్యాయుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-17T06:21:01+05:30 IST
కడుపు నొప్పి భరించలేక ఓ ఉపాధ్యాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నాతవరం ఎస్ఐ శేఖరం అందించిన వివరాల మేరకు... నాతవరం మండలం చెర్లోపాలెం పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఎన్వీ రమణ అదే మండలం జిల్లెడిపూడి పంచాయతీ వై.వెంకయ్యపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా కడుపునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. శనివారం భరించలేని కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నాతవరం, అక్టోబరు 16: కడుపు నొప్పి భరించలేక ఓ ఉపాధ్యాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నాతవరం ఎస్ఐ శేఖరం అందించిన వివరాల మేరకు... నాతవరం మండలం చెర్లోపాలెం పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఎన్వీ రమణ అదే మండలం జిల్లెడిపూడి పంచాయతీ వై.వెంకయ్యపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా కడుపునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. శనివారం భరించలేని కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.