చికిత్స పొందుతూ ఉపాధ్యాయుడి మృతి
ABN , First Publish Date - 2022-07-01T06:02:18+05:30 IST
చికిత్స పొందుతూ ఉపాధ్యాయుడి మృతి
పూడూరు, జూన్ 30 : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఉపాధ్యాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూడూరు మండలం, అంగడి చిట్టంపల్లికి చెందిన పేట వీరేశం (54) పరిగిలో నివాసం ఉండేవారు. పూడూరు మండలంలోని మంచన్పల్లి జడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గురువారం ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. వీరేశంకు భార్య ఉమాదేవి, కూతురు తేజస్విని, కుమారుడు వరుణ్ ఉన్నారు. అంగడి చిట్టంపల్లిలో జరిగిన వీరేశం అంత్యక్రియలకు పలువురు ఉపాధ్యాయులు హాజరై ఆయనకు నివాళులర్పించారు.