తానా కవి సమ్మేళనానికి కోరుకొండ మాస్టారు ఎంపిక

ABN , First Publish Date - 2022-05-28T06:40:33+05:30 IST

తానా అంతర్జాతీయ కవి గేయ సమ్మేళనానికి ఆం ధ్ర ప్రదేశ్‌ నుంచి తూర్పుగో దావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు చెందిన బీశెట్టి నూకరాజు మాస్టారు ఎంపికయ్యారు.

తానా కవి సమ్మేళనానికి కోరుకొండ మాస్టారు ఎంపిక
బీశెట్టి నూకరాజు

కోరుకొండ, మే 27 : తానా అంతర్జాతీయ కవి గేయ  సమ్మేళనానికి ఆం ధ్ర ప్రదేశ్‌ నుంచి తూర్పుగో దావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు చెందిన బీశెట్టి నూకరాజు మాస్టారు ఎంపికయ్యారు. ఉత్తర అమెరికా తెలుగు సం ఘం తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలను పురస్కరించుకుని పలు సామాజిక అంశా లపై ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ గేయ కవితల పోటీలు నిర్వహించారు. కోరుకొండ ప్రభుత్వ హైస్కూల్‌లో సైన్స్‌ ఉపాధ్యాయుడు నూకరాజు రచించిన ‘తల్లిపాలలాంటి తెలుగు సార మంతా అందుకో’ అనే గేయ కవితను తానా ఎంపిక చేసిం ది.ఈ మేరకు శుక్ర , శని, ఆదివారాల్లో జూమ్‌ ద్వారా తానా నిర్వహించనున్న ప్రపంచ స్థాయి వేదికపై  మాష్టారు తన గేయాన్ని పాడి వినిపించబోతున్నారు.   

Updated Date - 2022-05-28T06:40:33+05:30 IST