ఉపాధ్యాయులే సమసమాజ నిర్మాతలు

ABN , First Publish Date - 2022-09-24T06:20:31+05:30 IST

ఉపాధ్యాయులే సమసమాజ నిర్మాతలని ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ బుర్రా సుధారాణి అన్నారు.

ఉపాధ్యాయులే సమసమాజ నిర్మాతలు
అనంతగిరిలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ఎంపీపీ వెంకటేశ్వర్లు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సుధారాణి

అనంతగిరి, సెప్టెంబరు 23: ఉపాధ్యాయులే సమసమాజ నిర్మాతలని ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, మార్కెట్‌ కమిటీ  చైర్‌ పర్సన్‌  బుర్రా సుధారాణి అన్నారు. మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయంలో మండలానికి చెందిన 13మంది ఉత్తమ ఉపాధ్యాయు లను శుక్రవారం సన్మానించి, మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈవో సలీంషరీఫ్‌, సర్పంచ్‌ వేనేపల్లి వెంకటేశ్వరరావు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాస్‌రావు, అమీనాబాద్‌ సర్పంచ్‌ కోటేశ్వరరావు, బుర్రా పుల్లారెడ్డి, ఏవో  అందె సతీష్‌, హెచ్‌ఎం శ్రీనివాస్‌రావు, సుజాత, శేఖర్‌, భారతి, నాయకులు పాల్గొన్నారు. 

పెన్‌పహాడ్‌: రాష స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన మండలంలోని పొట్లపహాడ్‌ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యా యుడు మామిడి వెంకన్నను. శుక్రవారం ఆ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పుష్పావతి, ఎంపీ టీసీ సైదమ్మ, ఉపసర్పంచ్‌ నాగయ్య, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సభ్యులు శంకర్‌, శ్రీనివాస్‌, జానయ్య, మధుసూ దన్‌, నారాయణ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిలుకూరు:మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశా లలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు కె.రామారావు, మండల ఉత్తమ ఉపాధ్యాయులు దస్తగిరి, కలీల్‌, పాఠశాల ఉత్తమ ఉపాధ్యాయులు గుండు ఆదినారాయణ, శాంసన్‌లను ఘనంగా సన్మానించారు. కార్య క్రమాల్లో స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డా నారాయణరావు, ఎంపీ డీవో ఈదయ్య, సర్పంచ్‌ కొడారు బాబు, ఎంపీటీసీ రమణనాగయ్య, హెచ్‌ఎం కరుణాకర్‌రెడ్డి, గ్రామకార్యదర్శి శోభన్‌బాబు, పుట్టపాక అంజయ్య, హుస్సేన్‌,  వెంకటయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రఫి పాల్గొన్నారు. 

మోతె:ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 17మందిని  జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎంపీపీ ముప్పాని ఆశ, జడ్పీటీసీ సభ్యుడు పందిళ్లపల్లి పుల్లారావు సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో గోపాల్‌రావు, ఉపాధ్యాయులు బీఎల్‌ఎన్‌ చారి, రామ్మూర్తి కొటేశ్వరరావు, ముంతా శ్రీనివాస్‌, ఎలక శ్రీనివాస్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి, మజీద్‌, చిట్యాల ఉపేందర్‌, బాలాజి తదితరులు పాల్గొన్నారు

నూతన్‌కల్‌:మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాల యంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపీపీ భూరెడ్డి కళావతిసంజీవ రెడ్డి, జడ్పీటీసీ కందాళ దామోదర్‌రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ  రమమల్లారెడ్డి, ఎంఈవో రాములునాయక్‌ పాల్గొన్నారు. 




Updated Date - 2022-09-24T06:20:31+05:30 IST