గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులుగా 19 మందికి ఉద్యోగోన్నతి

ABN , First Publish Date - 2021-10-26T06:05:47+05:30 IST

జిల్లాలో 19 మంది గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల ఉద్యోగోన్నతి పొందినట్లు డీఈవో గంగాభవాని తెలిపారు.

గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులుగా 19 మందికి ఉద్యోగోన్నతి
నియామక ఉత్తర్వులు అందజేస్తున్న డీఈవో గంగాభవాని

గుంటూరు(విద్య), అక్టోబరు 25: జిల్లాలో 19 మంది గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల ఉద్యోగోన్నతి పొందినట్లు డీఈవో గంగాభవాని తెలిపారు. డీఈవో కార్యాలయంలో సోమవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఉద్యోగన్నతి పొందిన ఉపాధ్యాయులు  విద్యాశాఖకు వన్నేతెచ్చేలా పనిచేయాలని, విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేయాలని డీఈవో వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ హెచఎం ఎస్‌వీఆర్‌ ప్రసాద్‌, ఉపతనికీ అధికారి ఉర్దూ రేంజ్‌ ఎండీ ఖాసీం, ఐటీ సెల్‌ కోఆర్డినేటర్‌ శివనాగేశ్వరరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు షేక్‌ సంఽథాని, నారాయణరావు, పర్యవేక్షకులు నరసింహారావు, భాను, నాగమల్లేశ్వరరావు, ఎంఈవోల అసోసియేషన నాయకులు రవికాంత, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T06:05:47+05:30 IST