సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల వినతి
ABN , First Publish Date - 2021-07-27T06:25:26+05:30 IST
సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల వినతి
కంచికచర్ల రూరల్, జూలై 26: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని పీఆర్టీయూ నాయకులు సోమవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతను కలిసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, 11వ పీఆర్సీ అమలు, సీపీఎస్ విధానం రద్దుకు కృషి చేయాలని కోరారు. సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నాయకులు అక్బర్ బాషా, రాఘవరాజు, పూర్ణచంద్రరావు, నాగరాజు పాల్గొన్నారు.