ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలివ్వాలి

ABN , First Publish Date - 2021-10-18T05:04:35+05:30 IST

జిల్లాలో ఉపాధ్యాయులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎలిమెంటరీ సెకండరీ స్కూల్‌ టీచర్స్‌ కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ లిమెంటెడ్‌ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మిరాజా డిమాండ్‌ చేశారు. కడప నగరం సీఎ్‌సఐ పాఠశాలలో ఆదివారం సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది.

ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలివ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న బి.లక్ష్మీరాజా

కడప(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 17: జిల్లాలో ఉపాధ్యాయులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎలిమెంటరీ సెకండరీ స్కూల్‌ టీచర్స్‌ కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ లిమెంటెడ్‌ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మిరాజా డిమాండ్‌ చేశారు. కడప నగరం సీఎ్‌సఐ పాఠశాలలో ఆదివారం సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలిపారు. సీఎం జగన్‌ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, రెండున్నర సంవత్సరాలైనా ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి కె.శ్రీనివాసులు, డైరెక్టర్‌ బాలస్వామిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, విశ్వనాధ్‌రెడ్డి, ఫర్హతుల్లా, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-18T05:04:35+05:30 IST