AP News: జగన్కు సద్బుద్ధి ప్రసాదించాలని టీచర్లు కోరుకోవాలి : సోము వీర్రాజు
ABN , First Publish Date - 2022-09-05T23:49:48+05:30 IST
Amaravathi: ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) సీఎం జగన్ (CM Jagan)పై విరుచుకుపడ్డారు. విద్యకు, ఉపాధ్యాయులకు వైసీపీ పాలనలో సరైన గౌరవం దక్కడం లేదని పేర్కొన్నారు. అధికా
Amaravathi: ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) సీఎం జగన్ (CM Jagan)పై విరుచుకుపడ్డారు. విద్యకు, ఉపాధ్యాయులకు వైసీపీ పాలనలో సరైన గౌరవం దక్కడం లేదని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న సీఎం జగన్.. ఇప్పుడు మాట మార్చారని, ఇప్పుడు సీపీఎస్ (CPS) గురించి మాట్లాడితే టీచర్లనే కాదు.. వాళ్ల కుటుంబ సభ్యులను జైల్లో వేసే పరిస్థితులు దాపురించాయని విమర్శించారు. జగన్కు మంచి బుద్ధి రావాలని టీచర్లు భగవంతుణ్ని కోరుకోవాలి. జగన్ విషయంలో మరే ప్రత్యామ్నాయం లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ చక్కటి నటుడు
గురు పూజోత్సవం కార్యక్రమంలో సోము వీర్రాజు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ చక్కటి నటుడని కొనియాడారు. భరత నాట్యాన్ని అభ్యసించి, బాల రామాయణంతో చక్కగా నటించారని ప్రశంసించారు.