కదం తొక్కిన ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2021-04-23T05:21:17+05:30 IST

పీఆర్సీ కమిషన్‌ రిపోర్టు వెంటనే విడుదల చేయాలని, ఉపాధ్యాయుల అపరిష్కృతసమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లాలోని అన్ని మండలాల యూటీఎఫ్‌ శాఖలు గురువారం నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

కదం తొక్కిన ఉపాధ్యాయులు
హిరమండలం: ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా


  నిరసన చేపట్టిన యూటీఎఫ్‌ ప్రతినిధులు

(ఆంధ్రజ్యోతి బృందం) పీఆర్సీ కమిషన్‌ రిపోర్టు వెంటనే విడుదల చేయాలని, ఉపాధ్యాయుల అపరిష్కృతసమస్యలు పరిష్కరించాలని  యూటీఎఫ్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లాలోని అన్ని మండలాల యూటీఎఫ్‌ శాఖలు గురువారం నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. తక్షణం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని, 50 శాతం ఫిట్‌మెంట్‌తో 2018 నుంచి ఆర్థిక లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలను అందించారు. 

 


Updated Date - 2021-04-23T05:21:17+05:30 IST