సమష్టికృషి విజయానికి సోపానం

ABN , First Publish Date - 2022-07-07T04:56:13+05:30 IST

‘ కార్యకర్తలే మన బలం. ఓటర్లు ఉన్నారు. అందరిని ఒక తాటిపై నడిపేందుకు ఇన్‌చార్జిగా ఎం.ఎం కొండయ్య ఉన్నారు. నిరంతరం ఆయనతో పాటు నేను కూడా మీకు వెన్నంటి ఉంటూ ముందుకుసాగుతామని’ కొండయ్య తనయుడు అమర్‌నాఽథ్‌ అన్నారు. మండల పరిధిలోని ఈపురుపాలెం, జాండ్రపేట గ్రామ పంచాయతీల పరిధిలో జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సమష్టికృషి విజయానికి సోపానం
జాండ్రపేటలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆ పార్టీ ఇన్‌చార్జి ఎం.ఎం కొండయ్య కుమారుడు అమర్‌నాథ్‌

చీరాల, జూన్‌ 6 : ‘ కార్యకర్తలే మన బలం. ఓటర్లు ఉన్నారు. అందరిని ఒక  తాటిపై నడిపేందుకు ఇన్‌చార్జిగా ఎం.ఎం కొండయ్య ఉన్నారు. నిరంతరం ఆయనతో పాటు నేను కూడా మీకు వెన్నంటి ఉంటూ ముందుకుసాగుతామని’ కొండయ్య తనయుడు అమర్‌నాఽథ్‌ అన్నారు. మండల పరిధిలోని ఈపురుపాలెం, జాండ్రపేట గ్రామ పంచాయతీల పరిధిలో జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలసి సభ్యత్వ ఆవశ్యకతను వివరించారు. సమష్టికృషి విజయానికి సోపానమన్న అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు స్థానిక ముక్కోణపుపార్కు సెంటర్లోని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.   ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

 

Updated Date - 2022-07-07T04:56:13+05:30 IST