విమానంలో సాంకేతిక లోపం

ABN , First Publish Date - 2022-10-02T05:37:39+05:30 IST

విమానంలో సాంకేతిక లోపం

విమానంలో సాంకేతిక లోపం
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగిన ప్రయాణికులు

  • కొల్హాపూర్‌ వెళ్లాల్సిన అలియాన్స్‌ విమాన సేవలు రద్దు 
  • ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన 

శంషాబాద్‌ రూరల్‌, అక్టోబరు 1: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కొల్హాపూర్‌ వెళ్లాల్సిన అలియాన్స్‌ విమానం సాంకేతిక లోపంతో రద్దయింది. దీంతో ప్రయాణికులు  ఎయిర్‌పోర్టులో అందోళనకు దిగారు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 9.24గంటలకు శంషాబాద్‌ నుంచి కొల్హాపూర్‌ వెళ్లాల్సిన ఆలియాన్స్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎయిర్‌లైన్స్‌ అధికారులు విమా న సర్వీసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికులను మధ్యాహ్నం 2గంటల వరకు వేచి ఉండాలని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు. దీంతో ప్రయాణికులు ఎ యిర్‌పోర్టులోనే మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశారు. చెప్పిన సమయానికి కూడా విమాన సేవలు కొనసాగించలే దు. దీంతో గేటు నెంబర్‌ 10 వద్ద ప్రయాణికులు ఎయిర్‌లైన్స్‌ పనితీరుకు నిరసన గా ఆందోళనలు చేపట్టారు. విమానంలో మరమ్మతులు పూర్తికాక విమానం రద్దయిందని చెప్పారు. ప్రయాణికులు మరింత ఆగ్రహానికి గు రయ్యారు. చివరకు అధికారులు మరో విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులను తరలించారు.

Updated Date - 2022-10-02T05:37:39+05:30 IST