విజయవాడ-హైదరాబాద్ మధ్య రైల్వేలైన్‌లో సాంకేతిక సమస్యలు

ABN , First Publish Date - 2022-06-02T13:22:32+05:30 IST

విజయవాడ - హైదరాబాద్ మధ్య రైల్వే లైన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

విజయవాడ-హైదరాబాద్ మధ్య రైల్వేలైన్‌లో సాంకేతిక సమస్యలు

అమరావతి: విజయవాడ - హైదరాబాద్ మధ్య రైల్వే లైన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరువు మాధవరం రైల్వే స్టేషన్‌లో  మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు రైలు విజయవాడకు రావాల్సి ఉంది. ఇదే మార్గంలో పలు రైళ్లు కూడా నిలిచిపోయాయి. ఇంజన్‌కు ఎలక్ట్రికల్ లైన్‌కు మధ్యలో ఉండే జాయింట్ వద్ద సమస్యలు తలెత్తాయి. కాగా... సాంకేతిక సమస్య సరి చేసామని రైళ్లు కొద్దిసేపట్లో బయలుదేరుతాయని  రైల్వే అధికారులు చెబుతున్నారు. 


Updated Date - 2022-06-02T13:22:32+05:30 IST