ఫేస్‌బుక్‌లో పరిచమైన యువతి కోసం.. ఫ్రెండ్‌ను కత్తితో పొడిచేసిన కుర్రాడు

ABN , First Publish Date - 2022-04-12T08:31:46+05:30 IST

ఫేస్‌బుక్‌లో పరిచమైన ఒక యువతితో చాటింగ్ చేసే క్రమంలో ఇద్దరు మిత్రుల మధ్య గొడవ జరిగింది. ‘‘నీ వల్లే తను నాతో మాట్లాడటం లేదు’’ అంటూ గొడవ పడిన గోపాల్ రావత్ అనే యువకుడు.. తన స్నేహితుడు రాజ్‌వీర్‌పై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో మిత్రుడు...

ఫేస్‌బుక్‌లో పరిచమైన యువతి కోసం.. ఫ్రెండ్‌ను కత్తితో పొడిచేసిన కుర్రాడు

ఫేస్‌బుక్‌లో పరిచమైన ఒక యువతితో చాటింగ్ చేసే క్రమంలో ఇద్దరు మిత్రుల మధ్య గొడవ జరిగింది. ‘‘నీ వల్లే తను నాతో మాట్లాడటం లేదు’’ అంటూ గొడవ పడిన గోపాల్ రావత్ అనే యువకుడు.. తన స్నేహితుడు రాజ్‌వీర్‌పై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో మిత్రుడు సూరజ్ వర్మ భయపడిపోయి.. రాజ్‌వీర్‌ను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అక్కడ చికిత్స పొందుతూ రాజ్‌వీర్ చనిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వెలుగు చూసింది. 


రాజ్‌వీర్, గోపాల్ ఇద్దరూ స్నేహితులు వీళ్లకు ఫేస్‌బుక్‌లో ఖుషీ అనే అమ్మాయి పరిచయమైంది. ఇద్దరూ ఆమెతో చాట్ చేసేవాళ్లు. ఈ క్రమంలో ముగ్గురు స్నేహితులు బైక్‌పై వెళ్తుండగా.. ‘‘నువ్వు ఖుషీతో చాట్ చేయకు. నీ వల్ల నాతో మాట్లాడటం లేదు’’ అని రాజ్‌వీర్‌కు గోపాల్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే అతను గోపాల్ మాట వినకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 


ఈ సమయంలోనే గోపాల్ కోపంతో రాజ్‌వీర్‌ను కత్తితో పొడిచి పారేశాడు. వారితోపాటే ఉన్న సూరజ్.. గాయపడిన రాజ్‌వీర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అక్కడ చికిత్స పొందుతూ రాజ్‌వీర్ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సూరజ్, గోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఖుషీ అనే యువతి కోసం ఎంత గాలించినా ఆమె ఎవరో ఇంకా తెలియరాలేదని సమాచారం.


Updated Date - 2022-04-12T08:31:46+05:30 IST