Rajasthan: వృద్ధురాలిపై యువకుడి అత్యాచార యత్నం...ఆపై హత్య
ABN , First Publish Date - 2021-09-17T14:07:53+05:30 IST
రాజస్థాన్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది....
జైపూర్ : రాజస్థాన్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. హనుమాన్ ఘడ్ జిల్లా పిలిబంగా పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువకుడు పీకలదాకా తాగి మద్యంత మత్తులో పక్కింట్లో ఒంటరిగా ఉన్న 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం చేశాడు. వృద్ధురాలిపై అత్యాచారయత్నం విఫలం కావడంతో ఆ నరరూప రాక్షసుడు వృద్ధురాలిని చంపి, ఆమె మృతదేహంపై అత్యాచారం చేసిన దారుణ ఘటన సంచలనం రేపింది. పోలీసులు వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, నిందితుడైన కామాంధుడిని అరెస్టు చేశారు.