రహదారి పక్కన అపస్మారక స్థితిలో పడిఉన్న తల్లీ కూతుళ్లు.. ముందురోజు రాత్రి అక్కడ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-13T05:41:07+05:30 IST

ఒక 19 ఏళ్ల యువతి తన తల్లితోపాటు రహదారి పక్కన అపస్మారక స్థిలో పడి ఉంది. పోలీసులు వారిని ఆస్పత్రికి చేర్చారు. ఆ యువతి తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది...

రహదారి పక్కన అపస్మారక స్థితిలో పడిఉన్న తల్లీ కూతుళ్లు.. ముందురోజు రాత్రి అక్కడ ఏం జరిగిందంటే..

ఒక 19 ఏళ్ల యువతి తన తల్లితోపాటు రహదారి పక్కన అపస్మారక స్థిలో పడి ఉంది. పోలీసులు వారిని ఆస్పత్రికి చేర్చారు. ఆ యువతి తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. 


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ నగరానికి చెందిన లక్ష్మి(19, పేరు మార్చబడినది) తన తల్లితోపాటు హర్యానా రాష్ట్రంలో కూలీపని చేసుకొని జీవిస్తోంది. ఫిబ్రవరి 4న లక్ష్మి తన తల్లితో కలిసి హర్యానా నుంచి తన స్వస్థలం  ఫిరోజ్‌బాద్‌కు బయలు దేరింది. హర్యానా నుంచి ఫిరోజాబాద్ చేరుకోవడానికి ముందు ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురా నగరానికి బస్సులో వచ్చారు. అప్పటికే రాత్రి అయింది.


ఆ సమయంలో మథురా నుంచి ఫిరోజాబాద్ వెళ్లడానికి బస్సులు లేవు. ఈ కారణంతో లక్ష్మి తన తల్లితో పాటు రోడ్డుపైకి వచ్చి అక్కడ వెళ్లే కార్లను లిఫ్ట్ అడిగింది. ఇంతలో ఒక కారు వచ్చిన వ్యక్తి వారికి లిఫ్ట్ ఇచ్చాడు. ఆ కారులో ఆ వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. దారిలో లక్ష్మి తనకు దాహంగా ఉందని చెప్పడంతో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న నీళ్ల బాటిల్ ఇచ్చాడు. అందులో ఉన్న నీళ్లు లక్ష్మి, ఆమె తల్లి ఇద్దరూ తాగారు. కాసేపు తరువాత ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. 


వారిద్దరూ స్పృహలో లేని సమయంలో ఆ కారు నడిపే వ్యక్తి లక్ష్మిపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఇద్దరినీ రోడ్డు పక్కన పడేసి వెళ్లి పోయాడు. తెల్లవారే సరికి పోలీసులు వారిద్దరిని ఆస్పత్రికి చేర్చారు. ఆస్పత్రిలో లక్ష్మి తనపై అత్యాచారం జరిగినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు లక్ష్మికి మెడికల్ పరీక్షలు చేసి అత్యాచారం జరిగినట్లు నిర్ధరణ చేసుకున్నారు. ఆ కారు డ్రైవర్ ఎవరో, కారు నెంబర్ ఏమిటో తమకు తెలియదని లక్ష్మి, ఆమె తల్లి పోలీసులకు చెప్పారు.


పోలీసులు ప్రస్తుతం కారు గురించి టోల్ గేట్ల వద్ద సీసీటీవి వీడియోలను పరిశీలిస్తున్నారు.


Updated Date - 2022-02-13T05:41:07+05:30 IST