తలుపు వేయడానికి టెర్రస్ పైకి వెళ్లిన బాలిక.. అక్కడ ఆనుకోకుండా ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-03-09T05:41:28+05:30 IST
ఆ బాలిక పదో తరగతి చదువుతోంది. సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు రోజూ వెళ్లి వస్తుంటుంది. ఈ క్రమంలో ఆ యువతిపై పక్కింటి యువకుడు కన్నేశాడు.. నిరంతరం ఆమెనే గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం ఆ బాలిక తన ఇంటి టెర్రస్ తలుపు వేసేందుకు పైకి వెళ్లింది..
ఆ బాలిక పదో తరగతి చదువుతోంది. సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు రోజూ వెళ్లి వస్తుంటుంది. ఈ క్రమంలో ఆ యువతిపై పక్కింటి యువకుడు కన్నేశాడు.. నిరంతరం ఆమెనే గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం ఆ బాలిక తన ఇంటి టెర్రస్ తలుపు వేసేందుకు పైకి వెళ్లింది.. అదే అదునుగా ఆ యువకుడు గోడ దూకి అక్కడకు చేరుకున్నాడు.. ఆమెను బంధించి అక్కడే అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈశాన్య ఢిల్లీలోని జ్యోతి నగర్ ప్రాంతానికి 15 ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆ ప్రాంతంలోనే ఉండే ఓ యువకుడు ఆమెపై కన్నేశాడు. ఆమెను నిరంతరం గమనించేవాడు. ఆదివారం ఉదయం బాధిత బాలిక తల్లిదండ్రులు వివాహ కార్యక్రమం కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. ఆ విషయం తెలుసుకున్న నిందితుడు బాలిక కోసం మాటు వేశాడు. సాయంత్రం సమయంలో ఆ బాలిక తలుపు వేసేందుకు టెర్రస్ పైకి వెళ్లింది.
ఆ విషయం గమనించిన నిందితుడు గోడ దూకి టెర్రస్ పైకి చేరుకున్నాడు. బాలికను బంధించి అక్కడే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏడుస్తూ విషయం చెప్పింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.