Tejashwi Yadav: భార్య రాచెల్పై తేజస్వీ యాదవ్ కామెంట్స్ వైరల్
ABN , First Publish Date - 2022-08-13T02:13:33+05:30 IST
తన భార్య రాచెల్ (Rachel Godinho)తో వివాహానికి ముందు తన తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్తో
పాట్నా: తన భార్య రాచెల్ (Rachel Godinho)తో వివాహానికి ముందు తన తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్తో జరిగిన సంభాషణను బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav)తాజాగా వెల్లడించారు. ఓ జాతీయ చానల్తో మాట్లాడుతూ ఆయన చెప్పిన వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాచెల్ను ప్రేమించిన విషయాన్ని తేజస్వీ తన తండ్రికి చెబుతూ.. ‘‘నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమె క్రిస్టియన్’’ అని చెప్పానని గుర్తు చేసుకున్నారు. అందుకు లాలు.. ‘‘ఓకే. నో ప్రాబ్లెం’’ అని చెప్పారని పేర్కొన్నారు. రాచెల్ గొడినో గురించి మరిన్ని విషయాలు..
రాచెల్ హర్యానాలోని రేవారికి చెందినవారు. తల్లిదండ్రులతో కలిసి ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిపోయారు. ఢిల్లీలోనే చదువుకున్న ఆమె.. అక్కడి ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తేజస్వీ యాదవ్ క్లాస్మేట్. రేచల్ తండ్రి ఢిల్లీలో ఓ స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైరయ్యారు. రేచల్ కేబిన్ క్రూ మెంబర్గా పౌర విమానయాన పరిశ్రమలో పనిచేశారు.
లాలూ యాదవ్ చిన్న కుమారుడైన తేజస్వీ యాదవ్-రాచెల్ వివాహం గతేడాది జరిగింది. పెళ్లయినప్పటి నుంచి రాచెల్ పెద్దగా బయటకు రావడం లేదు. ఇటీవల భర్త ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఒకే ఒక్క మాట్లాడారు. ‘‘ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. వివాహం తర్వాత ఆమె తన పేరును రాజశ్రీ యాదవ్గా మార్చుకున్నారు. గతేడాది డిసెంబరులో జరిగిన తేజస్వీ యాదవ్-రాచెల్ వివాహానికి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అత్యంత సన్నిహితులైన స్నేహితులు, కుటుంబ సభ్యులు 50 మంది వరకు హాజరయ్యారు. తేజస్వీకి ఏడుగురు అక్కచెల్లెళ్లు, ఒక అన్న తేజ్ ప్రతాప్ ఉన్నారు.