ఏపీపై ఫిర్యాదు.. కేఆర్ఎంబీకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
ABN , First Publish Date - 2022-03-16T03:09:45+05:30 IST
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. తుంగభద్ర జలాల కోసం ఏపీ నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై..
హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. తుంగభద్ర జలాల కోసం ఏపీ నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండానే ఎత్తిపోతల పథకాలను నిర్మించారని లేఖలో పేర్కొన్నారు. రాఘవేంద్ర, మరో 12 పథకాలను నిర్మించిందని తెలిపారు. ఎత్తిపోతలకు తుంగభద్ర నీటిని తీసుకోకుండా చూడాలని లేఖలో కోరారు.