తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-03-12T15:36:54+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాల అనంతరం పద్దులపై సభలో చర్చ జరుగనుంది. ఈ రోజు సభలో రెండు బిల్స్తో పాటు 6 పద్దులపై చర్చ చేపట్టనున్నారు. సాంకేతిక విద్య, పర్యాటకం, మెడికల్ అండ్ హెల్త్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్, లేబర్ ఎంప్లాయిమెంట్, అడవుల అభివృద్ధిపై సభలో చర్చ జరుగనుంది. ఏబీఎన్ లైవ్ చూడండి.