మంగళవారంతో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2022-03-15T17:17:31+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగియనున్నాయి.

మంగళవారంతో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగియనున్నాయి. బడ్జెట్ సమావేశాలు మొదటి రోజునే బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి అవకాశం లేకపోడంపై సభలో బీజేపీ ఎమ్మెల్యేలు  నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగులుతూ సభా కార్యక్రమాలకు అటంకం కలిగించారంటూ సెషన్స్ మొత్తం సస్సెన్స్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. అసెంబ్లీలో తమ వాదనలు వినిపించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. సస్పెన్షన్ ఎత్తివేసి మిగిలిన ఒక్క రోజు సభకు ఎమ్మెల్యేలను అనుమతించాలని హైకోర్టు సూచించింది.


హైకోర్టు ఉత్తర్వులతో బీజేపీ ఎమ్మెల్యేలు  రఘునందనరావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. హైకోర్టు సూచన మేరకు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ వద్దకు అసెంబ్లీ సెక్రటరీ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తమ హక్కులను కాపాడాలని స్పీకర్‌ను ఎమ్మెల్యేలు కోరారు.  

Updated Date - 2022-03-15T17:17:31+05:30 IST