Telangana బీజేపీలో కీలక పరిణామం

ABN , First Publish Date - 2022-07-21T19:32:51+05:30 IST

తెలంగాణ బీజేపీ(BJP)లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Telangana బీజేపీలో కీలక పరిణామం

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ(BJP)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ(Telangana Organizing General Secretary) మార్పు జరిగింది. తెలంగాణ ప్రస్తుత ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ మంత్రి శ్రీనివాసులను బీజేపీ జాతీయ నాయకత్వం పంజాబ్‌కు బదిలీ చేసింది. అలాగే నాలుగు రాష్ట్రాలకు ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీలను మారుస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా(JP nadda) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీగా అజయ్‌ జంబ్వాల్‌(Ajay Jambwal),  కర్ణాటక ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీగా రాజీవ్‌ దివి(Rajiv divi), పశ్చిమ బెంగాల్  జాయింట్‌ జనరల్‌ సెక్రటరీగా సతీశ్ దొంద(Satish donda)ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా... తెలంగాణకు ఆర్గనైజింగ్‌ సెక్రటరీని నియామకాన్ని జేపీ నడ్డా ఇంకా పూర్తి చేయలేదు. పార్టీ సంస్థాగతపరంగా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ పదవి కీలకం కానుంది. ఈ క్రమంలో సంస్థాగతమైన మార్పుల్లో భాగంగా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేసింది. 

Updated Date - 2022-07-21T19:32:51+05:30 IST