మోదీకి చెప్పినా, గోడకు చెప్పినా ఒకటే: కేసీఆర్

ABN , First Publish Date - 2022-02-02T00:42:01+05:30 IST

హైదరాబాద్: బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మత పిచ్చి రేపుతూ, ప్రజల మధ్య కొట్లాటలు పెడుతూ సమాజ వాతావరణాన్ని కలుషితం చేస్తూ దేశాన్ని విభజించాలని చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు.

మోదీకి చెప్పినా, గోడకు చెప్పినా ఒకటే: కేసీఆర్

హైదరాబాద్: బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మత పిచ్చి రేపుతూ, ప్రజల మధ్య కొట్లాటలు పెడుతూ సమాజ వాతావరణాన్ని కలుషితం చేస్తూ దేశాన్ని విభజించాలని చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై తన స్పందన తెలిపేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాను ముంబై వెళ్తున్నానని బీజేపీయేతర నేతలతో చర్చలు జరిపి కేంద్రంపై పోరాటం జరుపుతానన్నారు. కలిసి వచ్చేవారందరినీ కలుపుకుంటూ దేశంలో అద్భుతమైన గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మోదీకి చెప్పినా, గోడకు చెప్పినా ఒకటేనన్నారు. బీజేపీ తీరు దున్నపోతుమీద వాన కురవడంలా ఉందని, బీజేపీ దేశానికి పట్టిన దరిద్రమని కేసీఆర్ విమర్శించారు. బీజేపీ యూపీలో గెలవొచ్చని, అయితే తద్వారా బీజేపీలో అహంకారం పెరుగుతుందన్నారు. అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని కేసీఆర్ చెప్పారు. 



Updated Date - 2022-02-02T00:42:01+05:30 IST