చెన్నైకు సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-12-13T04:22:49+05:30 IST

సీఎం కేసీఆర్ సోమవారం చెన్నై వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 11 గంటలకు విమానంలో...

చెన్నైకు సీఎం కేసీఆర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ సోమవారం చెన్నై వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 11 గంటలకు విమానంలో బయలుదేరి చెన్నై వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత రంగనాథస్వామి ఆలయంలో కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. తిరుగు పయనంలో సీఎం స్టాలిన్‌ను కలవనున్నారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి స్టాలిన్‌ను ఆహ్వానించనున్నారు. 

Updated Date - 2021-12-13T04:22:49+05:30 IST