కులవృత్తులపై కూడా జీఎస్టీ వేస్తారా?.. వీహెచ్ ఆగ్రహం
ABN , First Publish Date - 2021-12-30T00:45:53+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి రూ. 2కోట్ల ఉద్యోగాలిస్తానన్న..
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి రూ. 2కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ హామీ ఏమైందని ఆయన ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను మోదీ సర్కార్ ప్రైవేట్ పరం చేస్తోందని మండిపడ్డారు. చివరకు కులవృత్తులపై కూడా జీఎస్టీ వేస్తున్నారని, ఇకనైనా పోరాటం చేయకపోతే డీఆర్డీఎల్ను కూడా అమ్మేస్తారని వీహెచ్ వ్యాఖ్యానించారు. పీఏసీ మీట్ పెట్టాలని సోనియా, ఠాగూర్, రేవంత్కు లేఖ రాస్తున్నానని చెప్పారు. పబ్లిక్ సెక్టార్, జీఎస్టీ, నిరుద్యోగుల పక్షాన పోరాటానికి సిద్ధం కావాలని వీహెచ్ సూచించారు.