తెలంగాణలో ఉద్యోగుల పని తీరు, ఖాళీల భర్తీపై కమిటీ

ABN , First Publish Date - 2022-01-17T03:34:41+05:30 IST

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పని తీరు, ఖాళీల భర్తీపై ...

తెలంగాణలో ఉద్యోగుల పని తీరు, ఖాళీల భర్తీపై కమిటీ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పని తీరు, ఖాళీల భర్తీపై నలుగురు ఐఏఎస్‌లతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు.  ఐఏఎస్‌ శేషాద్రి అధ్యక్షతన ఈ కమిటీ పని చేయనుంది.సీఎం సెక్రెటరీ స్మితాసబర్వాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్యను సభ్యులుగా నియమించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ఉద్యోగుల పని తీరుపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. 


Updated Date - 2022-01-17T03:34:41+05:30 IST