గోదావరి నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ

ABN , First Publish Date - 2021-10-06T16:10:37+05:30 IST

చౌటుపల్లి ఎత్తిపోతల, చనాకా కొరాటా ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధంలేదని తెలంగాణ పేర్కొంటూ..

గోదావరి నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ

హైదరాబాద్: చౌటుపల్లి ఎత్తిపోతల, చనాకా కొరాటా ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధంలేదని గోదాదరి నది యాజమాన్యం బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తూ.. ఈ  మేరకు లేఖ రాసింది. ఈ రెండు తమ నికర జలాల్లో ఉన్నాయని పేర్కొంది. చౌటుపల్లిని ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టి పూర్తి చేశారని, ఆరేళ్లుగా ఈ ప్రాజెక్టు పనిచేస్తోందన్నారు. గెజిట్‌లో చనాకా, కొరాటా ప్రాజెక్టుకు ఆమోదం ఉందనే విషయాన్ని పొందుపరిచారని తెలిపారు. తాము ఇచ్చిన డీపీఆర్‌ను ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. అంతర్ రాష్ట్ర వివాదం కూడా లేదని సమయం వృధా చేయకుండా డీపీఆర్‌లకు ఆమోదం ఇవ్వాలని కోరింది.

Updated Date - 2021-10-06T16:10:37+05:30 IST