Telanganaలో పలువురు ఐఏఎస్ అధికారులు, డీఎస్పీల బదిలీ

ABN , First Publish Date - 2022-05-19T23:47:34+05:30 IST

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు, పలువురు డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‎టైల్ శాఖ కార్యదర్శిగా..

Telanganaలో పలువురు ఐఏఎస్ అధికారులు, డీఎస్పీల బదిలీ

Hyderabad: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు, పలువురు డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‎టైల్ శాఖ కార్యదర్శిగా బుద్ధ ప్రకాష్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ అండ్ ఐజీ‎గా రాహుల్ బొజ్జ, విద్యా శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ, డ్రగ్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్‌గా రీజ్వీ, జి.ఎ.డి కార్యదర్శిగా శేషాద్రి, టూరిజం, యువజన విభాగం కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాకు బాధ్యతలు అప్పగించింది.


రాష్ట్రంలో పలువురు డీఎస్పీలు కూడా బదిలీలు అయ్యారు. వేములవాడ డీఎస్పీగా k. నాగేంద్ర చారి, కామారెడ్డి (R) ఎల్లారెడ్డి  డీఎస్పీగా A.శ్రీనివాసులు, అచ్చంపేట్ డిఎస్పీగా K కృష్ణ కిషోర్, నాగర్కర్నూల్ డీఎస్పీగా B.మోహన్ కుమార్, నిర్మల్ డీఎస్పీగా L.జీవన్ రెడ్డి, హనుమకొండ (వరంగల్) ట్రాఫిక్ ఏసీపీగా A.మధుసూదన్, ఎల్బీనగర్ ఏసీపీగా C.అంజయ్యను ప్రభుత్వం నియమించింది. 

Updated Date - 2022-05-19T23:47:34+05:30 IST