వెంకన్న సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2021-10-29T01:07:58+05:30 IST

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాధవీదేవి గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

వెంకన్న సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాధవీదేవి గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయక మండపానికి చేరుకున్న జస్టిస్‌ మాధవీదేవిని వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. 

Updated Date - 2021-10-29T01:07:58+05:30 IST