అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శం

ABN , First Publish Date - 2022-05-21T06:31:36+05:30 IST

అభివృద్ధిలో తె లంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శం
చౌడంపల్లిలో వైకుంఠధామాన్ని ప్రారంభిస్తున్న జడ్పీ చైర్మన, ఎమ్మెల్యే

నార్కట్‌పల్లి, మే 20: అభివృద్ధిలో తె లంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని చౌడంపల్లి, కొండపాకగూ డెం గ్రామాల్లో శుక్రవారం సుమారు రూ.40 లక్షల విలువైన పలు అభివృద్ధి ప నులకు వారు శంకుస్థాపనలు, ప్రారంభించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా కేంద్రం గుర్తించిన 10 ఉత్తమ గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రానివే కావడం నిదర్శనమన్నారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నిర్దేశం మేరకు నిర్వహించిన పల్లె ప్రగతి పనులతోనే ఈ అవార్డులు దక్కాయన్నారు. ఓ వైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్ర జలు అండగా నిలవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ సూదిరెడ్డి న రేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లిఖార్జునరెడ్డి, సర్పంచులు దుబ్బ మధు, కొ మ్మనబోయిన మల్లేష్‌, ఎంపీటీసీలు మేకల రాజిరెడ్డి, శ్రీరామోజు జయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, నాయకులు మేక వెంకట్‌రెడ్డి, దామెర ఉదయ్‌, దేవేందర్‌, నర్సింహాచారి, రాంరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-21T06:31:36+05:30 IST