విధ్వంసమైన Telanganaను అభివృద్ధి చేస్తున్నాం: KCR

ABN , First Publish Date - 2022-05-18T23:09:54+05:30 IST

విధ్వంసమైన తెలంగాణ (Telangana)ను అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్ (KCR) ప్రకటించారు.

విధ్వంసమైన Telanganaను అభివృద్ధి చేస్తున్నాం: KCR

హైదరాబాద్: విధ్వంసమైన తెలంగాణ (Telangana)ను అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్ (KCR) ప్రకటించారు. తిరిగి బాగుచేసుకోటానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. ప్రగతిభవన్లో పల్లె-పట్టణ ప్రగతిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశం గర్వించే స్థాయిలో తెలంగాణను పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన ఉత్తమ గ్రామాలకు మన పల్లెలు ఎంపిక అయ్యాయని తెలిపారు. మొదటి దశలో పదికి పది గ్రామాలు తెలంగాణ నుంచి ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. రెండోదశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక చేశారని కేసీఆర్ వివరించారు.

Updated Date - 2022-05-18T23:09:54+05:30 IST