తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
ABN , First Publish Date - 2022-03-12T18:51:35+05:30 IST
తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 14న చైర్మన్ ఎన్నిక జరుగనుంది.
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈనెల 14న ఉదయం 11 గంటలకు చైర్మన్ ఎన్నిక జరుగనుంది. రేపు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. గుత్తా సుఖేందర్ రెడ్డికే మరోమారు కౌన్సిల్ చైర్మన్గా సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దీంతో రేపు ఉదయం 10:30 గంటలకు మండలి ఛైర్మన్ పదవికి గుత్తా నామినేషన్ వేయనున్నారు.