కేంద్రంపై తెలంగాణ మంత్రుల బృందం అసహనం

ABN , First Publish Date - 2021-12-24T00:10:08+05:30 IST

కేంద్రంపై తెలంగాణ మంత్రుల బృందం అసహనం వ్యక్తం చేస్తోంది. కేంద్రం 2 రోజుల్లో లేఖలు ఇస్తామని, ఇప్పటికీ ఇవ్వలేదని మంత్రి నిరంజన్‌రెడ్డి తప్పుబట్టారు.

కేంద్రంపై తెలంగాణ మంత్రుల బృందం అసహనం

ఢిల్లీ: కేంద్రంపై తెలంగాణ మంత్రుల బృందం అసహనం వ్యక్తం చేస్తోంది. కేంద్రం 2 రోజుల్లో లేఖలు ఇస్తామని, ఇప్పటికీ ఇవ్వలేదని మంత్రి నిరంజన్‌రెడ్డి తప్పుబట్టారు. 6 రోజులుగా ఢిల్లీలోనే పడిగాపులు కాస్తున్నామని తెలిపారు. రైతుల కోసం కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రైతుల స్థితిగతులను కేంద్రం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కేంద్రం ఒక రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాము పని లేక వచ్చామంటున్నారని, అంత చులకనగా ఉందా? అని ప్రశ్నించారు. కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామని నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-12-24T00:10:08+05:30 IST